1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (20:06 IST)

మావోయిస్టు ప్రభావిత గ్రామంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు

శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఏఎస్పీ చింతపల్లి సబ్ డివిజన్ చింతపల్లి మండలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తాజంగి గ్రామంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది కవాతు నిర్వహించారు.
 
అనంతరం తాజంగి గ్రామ గిరిజనులతో ఏఎస్పీ గారు మాట్లాడుతూ మూడవ విడత 17వ తేదీన జరగబోయే పంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, స్వేచ్ఛగా సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీ గ్రామ అభివృద్ధి కొరకు ఎవరైతే బాగుంటుందో అట్టివారిని ఎన్నుకోవాలన్నారు. 
 
స్థానిక పోలింగ్ కేంద్రాన్ని, తాజంగి గ్రామం చుట్టుప్రక్కల ప్రదేశాలను డ్రోన్ కెమెరాతో వీక్షించి, తనిఖీ చేసి అధికారులకు భద్రతా చర్యలపట్ల సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తాజంగి గిరిజనులు సహకరించాలని, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలుతో ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎటువంటి గొడవలు జరగకుండా సంయమనంతో ఉండాలని అన్నారు. శ్రీ టి.శ్రీను సిఐ చింతపల్లి సర్కిల్, శ్రీ మహమ్మద్ అలీ షరీఫ్ ఎస్సై చింతపల్లి పిఎస్ తదితరులు పాల్గొన్నారు.