1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 5 డిశెంబరు 2020 (19:20 IST)

అర్థరాత్రి కూతురితో యువకుడిని ఏకాంతంగా చూసిన తండ్రి, వెంటపడ్డాడు...

తను కష్టపడినా తన కుమార్తెను మాత్రం మంచి వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఆ తండ్రి. కూతురి కోసం పస్తులుండి మరీ డబ్బులు చేర్చాడు. కొత్త సంవత్సరంలో పెళ్ళి చేద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ కుమార్తె మాత్రం ఒక యువకుడితో ప్రేమలో పడిపోయింది. అతడితో శారీరకంగా కూడా కలిసింది. దాన్ని కళ్ళారా చూసిన తండ్రి ఆ యువకుడిని అతి దారుణంగా చంపేశాడు.
 
కాకినాడ ప్రతాప్ నగర్‌కు చెందిన రాజయ్యకు ఒక్కగానొక్క కుమార్తె మరియ. ఇంటర్ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. రాజయ్య భార్య అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితమే మృతి చెందింది. ప్రైవేటు ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు రాజయ్య. అయితే ఉన్నది ఒకే కూతురు కావడంతో ఆమెను మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. 
 
సరిగ్గా అన్నం తినకుండా డబ్బులు చేర్చిపెట్టాడు. అయితే రెండు నెలలుగా మరియ తన ఇంటికి సమీపంలోని రాము అనే యువకుడితో పరిచయం పెట్టుకుంది. ఆ పరిచయం కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. రాముతో కుమార్తె చనువుగా వుండటాన్ని చూసి హెచ్చరించాడు రాజయ్య. అయినా మారలేదు.
 
రామును కూడా పిలిచి ఇకపై తమ ఇంటికి రావద్దని చెప్పాడు. అయినా ఇద్దరూ మారలేదు. వాచ్‌మెన్ డ్యూటీ కోసం రెండురోజుల క్రితం రాత్రి వెళ్ళగా మరియ, రాము ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉన్నారు. దీన్ని కళ్ళారా చూశాడు రాజయ్య. ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ఇంటి నుంచి పారిపోతున్న రామును వెంబడించి నడిరోడ్డుపై కర్రతో తలపై గట్టిగా బాదాడు. దీంతో రాము అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. రాజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.