సంబంధిత వార్తలు
- భార్యను పక్కనబెట్టి.. ప్రియురాలితో లాడ్జిలో రొమాన్స్.. చివరికి షాక్.. ఎలాగంటే?
- ప్రేయసి గదిలో ప్రియుడు.. అర్థరాత్రి చితక్కొట్టారు.. తెల్లారేసరికి అల్లుడిని చేసుకున్నారు..
- నువ్వెవడివిరా... పోరా.. నీకు అన్నీ అయిపోయాయ్ కొడకా! నీ పెత్తనమేంటి?
- ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్టులో పెట్టేసిన ప్రియుడు, ఇక ఎందుకీ జీవితం అనుకున్న ప్రేయసి
- చిత్తూరులో ప్రియుడు మరొకరితో దొంగపెళ్లి, శోభనం ముహూర్తానికి ప్రత్యక్షమైన ప్రేయసి
ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం
వావి వరసలు మంటగలిసిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఐదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గోలీలపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గోలీలపేట శివారులో బాలిక రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
