1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (08:52 IST)

శ్రీశైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి నేడు అమిత్ షా రాక‌

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు ఆయ‌న హైదరాబాద్‌ చేరుకుంటారు.

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథి గృహంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్న భోజనం చేస్తారు.

మ‌ధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి తిరిగి బయలుదేరతారు. అమిత్ షా తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను అల‌ర్ట్ చేశారు. అమిత్ షా వ‌చ్చే దారి వెంట భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు.