సంబంధిత వార్తలు
- రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
- కాకినాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.. హోర్డింగ్లు అదుర్స్ (video)
- అడగ్గానే ఫ్రిజ్లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...
- నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోమని మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. అంతే గోదావరిలో...?
- కాకినాడ : జ్యూస్లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య
యూట్యూబర్ రావణ్కు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు.. మరో కేసు నమోదు
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్కు ఏపీ పోలీసులు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఓ కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే మరో కేసులో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రశ్న రావణ్ ఏమాత్రం పోలీసులకు సహకరించలేదని పేర్కొన్నారు.
గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో 2025లో జరిగిన గొడవను కుల ఘర్షణగా చిత్రీకరిస్తూ వీడియోలు పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై కొత్త కేసు నమోదైంది. దీనిపై ప్రశ్నించగా, తాను సమాధానాలు చెప్పనని, తన అరెస్టును కూడా యూట్యూబ్లో వీడియోలుగా అప్లోడ్ చేసి వ్యూస్ సంపాదించుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడుని గురువారం సాయంత్రం కోర్టులో హాజరుచనున్నారు.
కాగా, జూన్ 28వ తేదీన ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ నిరసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పిఠాపురానికి చెందిన జనసేన నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో రావణ్ను హైదరాబాద్ నగరంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. అయితే, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే కాకినాడ సర్పవరం పోలీసులు మరో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
