సంబంధిత వార్తలు
- నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోమని మహిళా కానిస్టేబుల్ వేధింపులు.. అంతే గోదావరిలో...?
- కాకినాడ : జ్యూస్లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య
- వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు
- మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...
- అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?
అడగ్గానే ఫ్రిజ్లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఓ దారుణం జరిగింది. అడగ్గానే ఫ్రిజ్లో నీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్నకొడుకు అమ్మను చంపేశాడు. ఫ్రిజ్లో నీళ్లు అడిగితే, త్వరగా తేలేదన్న ఆగ్రహంతో విచక్షణ మరిచిపోయి తల్లిపై కొడుకు పాశవికంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రాణాలు విడిచింది.
స్థానిక పోలీసుల కథనం మేరకు... స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన పెంటా నాగమణి (45) తన కుమారుడు రాజబాబుకు ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం భోజనం వడ్డించింది. భోజనం చేస్తూ ఫ్రిజ్లో ఉన్న నీళ్లు తేవాలని అమ్మను కోరాడు. అయితే, నీళ్లు తేవడంలో తల్లి జాప్యం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజబాబు పెద్దగా అరుస్తూ ఫ్రిజ్ దగ్గరకు వేగంగా వెళుతూ గుమ్మాన్ని ఢీకొని గాయపడ్డాడు.
దీంతో విచక్షణ కోల్పోయిన అతడు అదేసమయంలో నీళ్ళిచ్చిన తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై, నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన భర్త త్రిమూర్తులు, ఇరుగుపొరుగువారితో కలిసి భార్యను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చిన నాగమణి ఆదివారం ఉదయం కన్నుమూసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
