మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (10:00 IST)

పురందేశ్వరి, కన్నా ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా మారిపోయారు.. కేశినేని నాని

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు. కన్నాకు టీడీపీ ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్ర ద్రోహి అని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు.


నగరంలోని తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. కన్నా రాష్ట్ర ద్రోహి అని, బీజేపీలో చేరి రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తి అని విమర్శించారు.
 
అంతేగాకుండా పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరూ రాష్ట్రానికి ద్రోహులుగా తయారయ్యారని మండిపడ్డారు. బీజేపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి బాండ్స్ గంటలో వేగంగా అమ్ముడు అయ్యాడంటే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు వెళుతుందని కేశినేని నాని వ్యాఖ్యానించారు. 
 
దేశం స్వాతంత్ర్యం సాధించిన ఈ 72 సంవత్సరాలలో ఎన్నో కష్టనష్టాలు అధిగమించి ముందుకి వెళ్తుందని నాని అన్నారు. అన్ని రంగాల్లో ముందుకు వెళ్ల‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు.