1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (10:46 IST)

మూడోసారి కూతురు పుట్టిందని గొంతు నులిమి హతమార్చిన తండ్రి

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మూడోసారి కూడా కుమార్తె పుట్టిందని ఓ కసాయి తండ్రి పసికందు గొంతునులిమి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ వివరాలను పరిశీలిస్తే..

తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. మూడోసారి కూడా కుమార్తె పుట్టిందని ఓ కసాయి తండ్రి పసికందు గొంతునులిమి హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా అమృతమంగళం గ్రామానికి చెందిన కూలీ దామోదరన్, భార్య అంబిక దంపతులకు అనుప్రియ(11), ఇందుమతి(8) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. అంబిక రెండు రోజుల క్రితం మరో పాపకు జన్మనిచ్చింది. అయితే ఇద్దరు ఆడబిడ్డలుండడంతో ఆర్థిక ఇబ్బందుల విషయమై దామోదరన్‌తో అతని భార్యకు వాగ్వాదం పెరిగింది. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న చిన్నారి గొంతునులమడంతో ఏడుపు విన్న తల్లి అక్కడికి రావడం గుర్తించిన దామోదరన్ పరారయ్యాడు. స్పృహ కోల్పోయిన పసికందును వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.