1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:35 IST)

తుడ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా.. నాలుగు పండ్ల మొక్కలు, 12 నీడ నిచ్చే మొక్కలు

పర్యావరణ హితం కోసం తుడ పరిధిలో మొక్కల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తుడ కార్యాలయంలో అధికారులతో వివిధ అభివృద్ధి పనుల పురోగతి పై సమీక్షించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో నేరేడు, అల్లనేరుడు, రేగు, వెలగ వంటి పండ్ల మొక్కలు, 12 రకాల నీడ నిచ్చే మొక్కలు.. గన్నేరు, పారిజాతం, దేవ గన్నేరు, టేకోమా, ఆరే, రేల,ఆకాశ మల్లి, చెన్నంగి, నక్కెన, తబీబియా, అర్జెన్సియ లను అందించనున్నట్లు తెలియజేశారు.

గ్రామ ప్రజలు వాటిని సంరక్షించాలని కోరారు. నేడు మనం నాటే మొక్క పెరిగి పెద్దదై భవిష్యత్తు తరాలకు ఉపయుక్తంగా మారుతుందన్నారు. మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు.

ఈ మొక్కలను రోడ్డు కు ఇరువైపులా.. ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ స్థలాలలో నాటనున్నట్లు వివరించారు. అనంతరం తుడ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్షించారు.