1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:52 IST)

నారాయణ హాస్పిటల్ రోగులకు తీవ్ర ఇబ్బందులు, ఆక్సిజన్ అందక రోగి మృతి

నెల్లూరు నగరం రూరల్ నారాయణ రెడ్డి పేట పెళ్లూరు సునీత అనే మహిళ నారాయణ హాస్పిటల్లో గత మూడు రోజుల క్రితం కరోనాతో చేర్పించడం జరిగింది. ఐతే పేషంట్‌కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని అదేవిధంగా డాక్టర్లు గాని ఇక్కడున్న నోడల్ ఆఫీసర్ గాని ఎవరు కూడా తమకు సమాధానం చెప్పలేదని మహిళ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

నిన్న రాత్రి ఆక్సిజన్ అందకపోతే నారాయణ హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడితే వారు సమాధానం చెప్పలేదని, తెల్లవారుజామున మరణించినట్లుగా హాస్పిటల్ సిబ్బంది చెప్పారని తెలిపారు.

నారాయణ హాస్పిటల్లో రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని నారాయణ హాస్పిటల్ ముందు అనేక మంది కరోనా పేషెంట్ బంధువులు తమ నిరసన తెలియజేయడం జరిగింది. నారాయణ వైద్యశాల మీద జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.