1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:25 IST)

డబ్బు కోసం అందాన్ని పెట్టుబడిగా పెట్టిన ఇంజనీరింగ్ విద్యార్థిని..

డబ్బులు అవసరమయ్యాయి. ఇంకేముంది.. అందాన్ని పెట్టుబడిగా పెట్టింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇందులో భాగంగా చదువుకుంటూ యూసుఫ్‌గూడాలోని ఓ వేశ్యాగృహంలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని యూసుఫ్‌గూడా

డబ్బులు అవసరమయ్యాయి. ఇంకేముంది.. అందాన్ని పెట్టుబడిగా పెట్టింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇందులో భాగంగా చదువుకుంటూ యూసుఫ్‌గూడాలోని ఓ వేశ్యాగృహంలో చేరిపోయింది. వివరాల్లోకి వెళితే..నగరంలోని యూసుఫ్‌గూడాలో ఒక వేశ్యాగృహంపై పోలీసుల దాడిలో పట్టుబడిన ఓ అమ్మాయి కథ షాకిచ్చింది.

సినిమా అవకాశాలు సంపాదించుకోవాలని కలలు కంటూ.. దానికి డబ్బు అవసరం కావడంతో వేశ్యావృత్తిలోకి దిగినట్లు తెలిపింది. ఈ విషయంలో ఆ వేశ్యాగృహ నిర్వాహకుల పాత్ర కూడా ఉంది. ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ వృత్తిలోకి దించారు. 
 
నగరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హీరోయిన్ అవ్వాలనే కోరిక ప్లస్ అందం కూడా వుండటంతో ఈ వృత్తిలోకి దిగిందని పోలీసులు చెప్తున్నారు. ఓ వేశ్యాగృహంపై జరిపిన దాడిలో  నాగభాస్కర్, దుర్గా ప్రసాద్, ధర్మ.. అనే వ్యక్తులు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డారు.

ఈ రైడ్ లో ఇద్దరు అమ్మాయిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక అమ్మాయి మోడల్. మరో అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని. ఈ ఇంజనీరింగ్ విద్యార్థినే డబ్బు కోసం ఈ వృత్తిలోకి దిగిందని వారు చెప్పారు.