శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2019 (07:01 IST)

వైజాగ్ కైలాసగిరిపై మహిళ గ్యాంగ్ రేప్

విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో మహాపచారం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ మహిళను నలుగురు యువకులు పట్టుకుని అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా నిర్ధారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, 18 యేళ్ళ వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తర్వాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ పిమ్మట తన తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు... ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ నిందితులంతా జోడుగుళ్ళపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.