శుక్రవారం, 20 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : బుధవారం, 11 మే 2016 (11:58 IST)

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు - తిరుపతిలో వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తట్టుకోలేక ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి కుమ్మరతోపుకు చెందిన శివకుమార్‌కు కడప జిల్లాకు చెందిన సిద్ధేశ్వరమ్మకు 14 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అదనపు కట్నం కోసం ప్రతిరోజు భర్త శివకుమార్‌ సిద్ధేశ్వరమ్మను వేధించేవాడు. 
 
గత పదిరోజుల క్రితం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మహిళా పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది సిద్దేశ్వరమ్మ. అయితే మంగళవారం రాత్రి కూడా శివకుమార్‌ కట్నం కోసం వేధించడంతో మనస్థాపానికి గురైన సిద్ధేశ్వరమ్మ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.