సంబంధిత వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో పత్తి పంట నాణ్యతకై వెల్స్పన్ ఫౌండేషన్ బెటర్ కాటన్ ఇనీషియేటివ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- జీహెచ్ఎంసీ పరిధిలో 1540 పోస్టుల భర్తీకి పచ్చజెండా
- బీటెక్ విద్యార్థిని హత్య కేసు - నిహారికకు బెయిల్ - జైలు నుంచి రిలీజ్
- నార్సింగిలో దారుణం : మహిళకు మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్
- అనాథ వ్యక్తికి బీమా చేయించి చంపేశారు.. ఎక్కడ?
స్నేహితులతో పందెం వేసి ఓడిపోయాడు.. డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. తన స్నేహితులతో కలిసి క్రికెట్ పందెం కాసిన ఓ యువకుడు.. ఓ పందెంలో ఓడిపోవడంతో స్నేహితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నార్లగూడ తండాలో గురువారం వెలుగుచూసింది.
పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన అంగోతు అమర్, సువర్ణ అనే దంపతులు దిన కూలీలు. వీరి రెండో కుమారుడు ప్రకాశ్(19) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ పోరులో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ తన స్నేహితులతో వేలాది రూపాయల్లో బెట్టింగ్ కాశాడు.
కానీ, ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. దీంతో ఉదయానికల్లా డబ్బులు చెల్లించాలని స్నేహితులు పట్టుబట్టారు. డబ్బులెలా చెల్లించాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన ప్రకాశ్ ఇంట్లోనే ఉరేసుకున్నాడు. పందెం తమ కుమారుడిని బలిదీసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. అతనితో పందెం వేసిన స్నేహితులెవరు? ఎంతమేరకు పందెం కట్టారనే విషయాలపై ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో సీఐ నవీన్ కుమార్ విచారణ జరుపుతున్నారు.
