సంబంధిత వార్తలు
- ఆటలకే పరిమితం తప్ప.. తిండి మీద ధ్యాస పెట్టరు...?
- ఒత్తిడిని తిప్పికొట్టాలంటే... పసుపు పాలు తాగాల్సిందే
- బుల్లిఉల్లిలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మజ్జిగలో ఉల్లిముక్కల్ని కలిపి తాగితే?
- పురుషులు రాత్రి పడుకోబోయే ముందు పాలలో ఆ మాత్రను కలుపుకుని తాగితే..?
- తాగితే.. రాగి చెంబు లేదా మట్టికుండలోని నీటినే తాగాలి..
ఇలా భోజనం తిన్నారే అనుకోండి... రాయి... రాయిలా వుంటారంతే...
ఆయుర్వేదం ప్రకారం భోజనం మూడువిధాలుగా తీసుకోవాలని నిర్దేశిస్తుంది. ఆహారం తీసుకునేటప్పుడు జీర్ణ సంబంధ బాధలు లేకుండా ఉండాలంటే మూడు ముఖ్యమయిన నియమాలను పాటించాలని ఆయుర్వేదం చెపుతుంది.
వాటిలో మొదటిది హితభుక్త.... శరీరానికి మేలు చేసే ఆహారం సుళువుగా జీర్ణమయ్యేదానిని హితభుక్తగా నిర్దేశించింది.
మితభుక్త... అవసరం మేరకు తినడం, అధికంగా తినకపోవడం, ఎక్కువసార్లు తినకపోవడం, సమయపాలన, ఎక్కువ పదార్థాలు తినకపోవడాన్ని మితభుక్త.
ఋతుభుక్త... ఆయా ఋతువుల్లో లభ్యమయ్యే ఆహారం తప్పనిసరిగా తినడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రకృతి ప్రసాదించే ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం - ఋతుభుక్తగా నిర్దేశించారు. ఈ ప్రకారంగా భోజనం చేస్తుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు.
