శుక్రవారం, 13 మార్చి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:29 IST)

పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి...?

మనం చేసుకునే సౌందర్య చిట్కాలన్నీ దాదాపుగా చర్మానికి నునుపు, తెలుపు తెచ్చేవే. తెల్లగా రావాలని ప్రతి ఒక్కరూ ఆశించడంలో తప్పులేదు. వున్న రంగు కంటే కాస్త ఎక్కువ రంగు మెరుగుపడాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇందుకోసం బ్యూటీపార్లర్‌లకు వెళ్లే తీరిక లేకుంటే ఇంట్లోనే అంతకంటే మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ ట్రీట్‌మెంట్లు.
 
4 బాదం పప్పులను నానబెట్టి పాలు కలుపుతూ మెత్తగా గ్రెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వరుసగా పదిహేను రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
 
ఒక స్పూన్ పెసర పిండికి రెండు స్పూన్ల పాలు, రెండు మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రమం తప్పకుండా నాలుగు వారాల పాటు చేయాలి.
 
పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను చర్మానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా పదిహేను రోజులు చేయాలి. ఒక టమోటాను గ్రైండ్ చేసి 3 చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇలా ఇరవై రోజులపాటు ఉదయం, సాయంత్రం చేయాలి.