1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 మే 2016 (12:52 IST)

టెలికాం సంస్థలకు సుప్రీంలో ఊరట.. కాల్‌డ్రాప్‌కు పరిహారం సరికాదు!

ప్రైవేట్ టెలికాం సంస్థలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాల్‌డ్రాప్‌కు పరిహారం కాదని పేర్కొంది. ఈ మేరకు ట్రాయ్‌ ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. 
 
కాల్‌డ్రాప్‌ అయిన ప్రతిసారి సంబంధిత టెలికాం ఆపరేటర్లు వినియోగదారులకు పరిహారం చెల్లించాలని ట్రాయ్‌ గతేడాది అక్టోబర్‌ 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతిరోజు మూడు కాల్‌డ్రాప్‌లకు ఒక రూపాయి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 
 
అయితే ట్రాయ్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. టెలికాం ఆపరేటర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానంపై టెలికాం సంస్థలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది మొబైల్ వినియోగదారునికి నిరాశేనని చెప్పుకోవచ్చు.