1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Javed Akhtar Supports Mohammad Shami Amid Ramadan Fasting Controversy

మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగాడు.. రోజాను పాటించలేదు.. పాపి... రిజ్వీ బరేల్వీ

shami
shami
ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగి వివాదానికి కేంద్రబిందువుగా నిలిచాడు. ఈ సంఘటన కొంతమంది ముస్లిం మతాధికారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రంజాన్ మాసాన్ని ఇస్లాం అనుచరులు పవిత్రంగా భావిస్తారు. ఈ కాలంలో వారు ఉపవాసం ఉంటారు.
 
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ బరేల్వీ షమీని విమర్శించారు. ఈ క్రికెటర్ ఉపవాసం పాటించకపోవడం ద్వారా మతపరమైన నిబంధనలను ఉల్లంఘించాడని పేర్కొన్నారు. "షమీ మత నియమాలను ఉల్లంఘించాడు.. పాపి" అని రిజ్వీ ఆరోపించారు.
 
ఆరోగ్యవంతమైన పురుషుడు లేదా స్త్రీ రోజాను పాటించకపోతే వారు నేరస్థులు అవుతారు. భారత క్రికెటర్ మహ్మద్ షమీ మ్యాచ్ సమయంలో నీరు లేదా ఏదో డ్రింక్ తాగాడు. షమీ ఆట ఆడుతున్నాడంటే ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. ఆరోగ్యంగా ఉన్న షమీ ఉపవాసం ఎందుకు చేయలేదు.. అని మౌలానా షాబుద్దీన్ అన్నారు.
 
షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. భారత జట్టులోని కీలక బౌలర్లలో షమీ ఒకడు. చాలా సందర్భాలలో షమీ తన బౌలింగ్ తో జట్టును విజయపథంలో నడిపించాడు.సెమీ-ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 
 
విమర్శలు ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మరియు క్రికెట్ సమాజంలో షమీకి విస్తృత మద్దతు లభించింది. చాలా మంది నెటిజన్లు ఆయనను సమర్థించారు. ఆయన ఏ తప్పు చేయలేదని నొక్కి చెప్పారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్‌ను మతంతో కలపవద్దని ప్రజలను కోరారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు ఎవరిది... చాట్ జీపీటీ జోస్యం ఏంటి?