శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (17:16 IST)

నోరు పారేసుకున్న అక్తర్ : ముందు కాశ్మీర్.. ఆ తర్వాత భారత్‌ను ఆక్రమిస్తాం...

రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు పొందిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌కు నోటిదూల ఎక్కువైంది. ఆయన భారత్‌ను ఉద్దేసించి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. తొలుత కాశ్మీర్‌ను ఆక్రమిస్తామని, ఆ తర్వాత భారత్‌ను ఆక్రమిస్తామని వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు ఇపుడు చేసినవి కావు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
గతంలో స‌మా టీవీతో అక్తర్‌తో ఓ ఇంటర్వ్యూ జరిపింది. అపుడు ఆయన మాట్లాడుతూ గజ్వా ఈ హింద్ గురించి ప్ర‌స్తావించారు. భార‌త్ కోసం నిర్వ‌హించే యుద్ధ‌మే గ‌జ్వా ఈ హింద్‌. ఉర్దూ మ‌త‌బోధ‌కుల ప్రకారం.. ముస్లిం యోధులు భార‌త భూభాగాన్ని హ‌స్తం గ‌తం చేసుకోవ‌డమే గ‌జ్వా ఈ హింద్‌. కానీ అనేక మంది ముస్లిం బోధ‌కులు ఆ సిద్ధాంతాన్ని వ్య‌తిరేకిస్తారు.
 
గ‌జ్వా ఈ హింద్ స‌మ‌రం జ‌రుగుతుంద‌ని త‌మ పురాణాల్లో ఉంద‌ని, అట్టాక్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని న‌ది రెండు సార్లు ర‌క్తంతో ఎర్ర‌గా మారుతుంద‌న్నారు. ఆఫ్ఘ‌ాన్ ద‌ళాలు అట్టాక్ చేరుకుంటాయ‌ని, ఉజ్బెకిస్తాన్ నుంచి కూడా ద‌ళాలు వ‌స్తాయ‌ని అక్త‌ర్ తెలిపారు. త‌మ‌కు చెందిన ప‌విత్ర పుస్త‌కాల్లో గ‌జ్వా ఈ హింద్ గురించి ప్ర‌స్తావించార‌ని, దాని ప్ర‌కారం తొలుత కాశ్మీర్‌ను, ఆ త‌ర్వాత అన్ని వైపుల నుంచి భార‌త్‌ను ఆక్ర‌మిస్తామ‌ని షోయెబ్ అన్నారు.