1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (17:45 IST)

ప్రియుడితో ఫోన్ కాల్, పసికందు గుక్కపెట్టి ఏడుస్తుంటే గోడకేసి కొట్టింది, అంతే....

తల్లి దారుణానికి తెగబడింది. నెల కూడా నిండని పసికందును తన చేతులతో చంపేసింది. ఈ దారుణం డిసెంబర్ 9న జరిగింది. ఐతే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

 
కొట్టాయంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. 21 ఏళ్ల మహిళకు నవంబరు నెలలో మగశిశువును ప్రసవించింది. ఐతే ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రి చుట్టూ తిరుగాల్సి వచ్చింది. మరోవైపు భర్త ఆమెను విడిచి దూరంగా వుంటున్నాడు.

 
దాంతో మరో యువకుడు ఈమెకి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతుండగా బిడ్డ బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. దాంతో కోపం పట్టలేక ఆ శిశువు తలను గోడకేసి కొట్టింది. అంతే.. బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

 
ఐతే ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఐతే బిడ్డ మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా అతడికి వెనుక పుర్రెపై గాయాలున్నట్లు తేలింది. దీనితో బిడ్డ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.