సంబంధిత వార్తలు
- నైటీ వేసుకుంటోందని భార్యకు నిప్పు పెట్టిన భర్త
- ప్రియుడి కోసం బంగారు నగలు తాకట్టు పెట్టి భర్త హత్యకు రూ. 5 లక్షలు అడ్వాన్స్
- మొగుడికి భార్య మొట్టికాయ, జెల్లకాయ, డిప్పకాయ: ప్లీజ్ కొట్టొద్దూ అంటూ ఏడుస్తున్న భర్త, వీడియో
- రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?
- ప్రియురాలి కొడుకును చంపేసిన ప్రియుడు.. భర్తను హత్య చేయించిన భార్య.. ఎక్కడ?
అక్కను వేధించిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు
మద్యం మత్తులో అక్కను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడనే కోపంతో.. అక్క మొగుడిని బావమరిది హతమార్చిన ఘటన విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
తన సోదరిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఒక ఆటో డ్రైవర్, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. తన సోదరిని కొట్టవద్దని శ్రీను పలుమార్లు ప్రశాంత్ను మందలించినప్పటికీ అతని తీరు మారలేదు.
దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను, పక్కా పథకం ప్రకారం శుక్రవారం రాత్రి కైలాసపురం వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రశాంత్ను అడ్డుకుని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
ఈ దాడిలో ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
