గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: శనివారం, 29 జనవరి 2022 (18:33 IST)

భార్య అందంగా లేదని మరో యువతి మోజులో పడ్డాడు, నిజం తెలిసిన యువతి ఛీ కొట్టింది, అంతే...

పెళ్ళయ్యింది. భార్య అందంగా లేదని అతడి అభిప్రాయం. ఇంటికి వెళితే భార్య ముఖం చూసేవాడు కాదు. సంసారం చేయడం మానేశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదురా అంటూ తల్లిదండ్రులు అడుగుతున్నా సమాధానం మాత్రం చెప్పేవాడు కాదు. ఉన్న కొద్దిసేపు ముభావంగానే ఉండేవాడు. తనలోని బాధను తనలోనే దాచుకుని ఒక్కసారిగా సెల్ఫీ వీడియో ద్వారా బహిర్గతం చేశాడు. తనువు చాలించాడు.

 
తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం శివారు కొప్పిశెట్టివారి పాలెంలో విషాదం చోటుచేసుకుంది. అమ్మాయి మోసం చేసిందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు గత కొంతకలంగా ఒక అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. 

 
ప్రేమ పేరుతో తనవద్ద నుంచి భారీగా డబ్బులు, బంగారం తీసుకుని ఇప్పుడు వేరే పెళ్ళి చేసుకుంటోందని ఆ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కాడు. ఒక వీడియోను రెడీ చేసి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో తను తన ప్రియురాలు కలిసి ఉన్న వీడియోలు, ఫోటోలను షేర్ చేశాడు.

 
అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. అయితే గతంలోనే ఈ యువకుడికి పెళ్ళయింది. భార్య అందంగా లేదని ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతితో సహజీవనం కూడా చేశాడు. ఐతే అతడికి ఇప్పటికే పెళ్లయిందని తెలిసిన యువతి అతడిని దూరం పెట్టేసింది. దాంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.