హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష
హనుమాన్ జయంతిని శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తులకు ఈ రోజు అత్యంత విశిష్టమైనది. శ్రీ ఆంజనేయ స్వామి మాత అంజనాదేవి, కేసరి దంపతుల కుమారుడు. ఆయనను వాయుదేవుని (అంటే పవన దేవుని) కుమారుడిగా కూడా వర్ణిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరాముని పరమ భక్తుడు. శ్రీ ఆంజనేయ స్వామి సుమారు 1 కోటి 85 లక్షల సంవత్సరాల క్రితం జన్మించారు). శ్రీ ఆంజనేయ స్వామి, చైత్ర పౌర్ణమి రోజున, సూర్యోదయం అయిన వెంటనే జన్మించారని విశ్వసిస్తారు.
హనుమాన్ జయంతి రోజున రోజంతా ఉపవాసం పాటిస్తారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం
మంచిది. తమిళనాడులో, హనుమాన్ జయంతిని హనుమత్ జయంతిగా పిలుస్తారు. దీనిని మార్గశిర అమావాస్య రోజున జరుపుకుంటారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, హనుమాన్ జయంతి వేడుకలను 41 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇవి చైత్ర పౌర్ణమి నాడు ప్రారంభమై, వైశాఖ మాసంలో కృష్ణ పక్షం పదవ రోజున ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్లో భక్తులు చైత్ర పౌర్ణమి నాడు 41 రోజుల దీక్షను ప్రారంభించి, హనుమాన్ జయంతి రోజున దానిని ముగిస్తారు.
రామాయణంలో శ్రీరాముడికి అండగా నిలిచి అసాధ్యాన్ని సాధ్యం చేసిన వాయుపుత్రుడు, కలియుగంలో కూడా భక్తులను కాపాడుతున్నాడనే విశ్వాసం ఉంది. గురువారం హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడిని పూజించడం ద్వారా సర్వాభీష్ఠాలు చేకూరతాయి.
2026లో తేదీ, ముహూర్తం 2026లో హనుమజ్జయంతి ఏప్రిల్ 2న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1 ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 2 ఉదయం 7:41 గంటల వరకు కొనసాగుతుంది. సూర్యోదయ తిథిని ఆధారంగా తీసుకుని ఏప్రిల్ 2నే ప్రధాన పూజలు నిర్వహిస్తారు.
హనుమజ్జయంతి రోజున భక్తులు ఇంట్లో లేదా ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. గంగాజలంతో అభిషేకం చేసి, పూలతో అలంకరిస్తారు. అరటిపండ్లు, లడ్డూలు వంటి నైవేద్యాలు సమర్పిస్తారు. పూజలో భాగంగా హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టకం పారాయణం చేయడం ద్వారా మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం.
