విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం
చదువుల్లో రాణించాలన్నా, జ్ఞానాన్ని సముపార్జించాలన్నా దానికి హయగ్రీవుని ప్రార్థించాలి. భక్తితో ఆయనను ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే విద్యలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆ శ్లోకాన్ని పఠిద్దాం.
జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే
ఈ శ్లోకాన్ని జపిస్తే జ్ఞానాన్ని పొందుగలుగుతారు. చదువులో ఏకాగ్రతను సాధిస్తారు. నిత్యం హయగ్రీవుని కొలిచేవారు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. శ్రీ మహావిష్ణు అవతారమైన హయగ్రీవుడు జ్ఞాన సముద్రం. ఆయన వేదం యొక్క నాలుగు రూపాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు. హయగ్రీవుడు సరస్వతి దేవికి జ్ఞానాన్ని బోధించాడని పురాణాల్లో చెప్పబడింది.
మానవ శరీరం, గుర్రపు తలతో తెల్లటి రంగులో తెల్లటి వస్త్రాలతో, తెల్లటి కమలంపై ఆశీనులై వుంటారు ఈ స్వామివారు. మధు, కైటభ అనే రాక్షసుల నుండి వేదాలను రక్షించి, వాటిని మళ్ళీ బ్రహ్మకు బోధించినట్లు పురాణాలలో చెప్పబడింది. హయగ్రీవుడి అనుగ్రహం లేకుండా మంచి జ్ఞానాన్ని పొందలేరని విశ్వాసం.
