Author Jaya 51.html

Notifications

national news
జయ
Content provider

Visakhapatnam: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. ఏమైంది..?

Visakhapatnam: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య.. ఏమైంది..?పెందుర్తిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. పెందుర్తి మండలం చింతల అగ్రహారం కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో మల్ల ప్రవీణ్ కుమార్, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు మరణించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మల్ల ప్రవీణ్ కుమార్ ముందుగా తన భార్య, ఇద్దరు కుమార్తెలకూ విషం ఇచ్చి, ఆ తర్వాత తాను కూడా విషం సేవించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్ 2 వరకు వర్షాలుబంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు సెప్టెంబర్ 2 వరకు ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని అధికారులు వివరించారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్‌ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అప్పుడప్పుడు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి, అతి వ్యాయామమే కారణమా?, వీడియో

నేపాల్ భోటేకోశి వరద భారతదేశం గండకీ నదికి చేరింది, కొట్టుకు వచ్చిన 3 మృతదేహాలు

సోదరునికి రాఖీ కడుతున్నారా? ఈ శ్లోకం చెబుతూ కట్టండి, టైమింగ్స్ ఏంటి?