మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 5 జులై 2016 (15:32 IST)

కీళ్ళు నొప్పులకు పారిజాతం ఆకులు... అలాంటి వాళ్లు మాత్రం తీస్కోకూడదు...

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి. *కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి

కీళ్ళు, మోకాళ్ళ నొప్పులకు మన ఋషులు వైద్యాన్ని మన వంటింటి దాకా తెచ్చారు. మోకాలిచిప్పలు మార్చవలసిన పరిస్థితులలో కూడా ఈ వైద్యం పూర్తిగా నయం చేసిన సంఘటనలు జ‌రిగాయి.
 
*కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే లేచి పారిజాతం ఆకులు నాలుగు తీసుకుని నలిపి గ్లాసు నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యే వ‌ర‌కూ మరగించి, వడకట్టి చల్లార్చి పరగడుపునే త్రాగాలి. 
* రోజుకు రెండుసార్లు గ్లాసు మజ్జిగలో ఒక‌ గ్రాము కిళ్ళీలో వాడే సున్నం క‌లిపి త్రాగాలి.
* రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు ఆవు పాలలో ఒక చిన్న చెంచా పసుపు కలిపి వేడి చేసి, దించి దానిలో ఒక‌ చెంచా ఆవు నెయ్యి వేసి, బాగా తిరగగొట్టి త్రాగాలి.
* ఈ వైద్యం కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకు వాడకూడదు.
* సాధారణ నొప్పులు ఉన్నవారు 45 రోజులు, బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నవారు 3 నెలలు వాడాలి.
* ఈవిధంగా చేసే సమయంలో మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిది. బాగా అరిగే తేలికైన అహారం ఉపయుక్తం.