1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 1 అక్టోబరు 2018 (19:45 IST)

అలా శక్తి లేనట్లుంటే ఈ ఒక్క పండు తిని చూడండి...

ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, బాగా నిసత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది.

మన శరీరంలో సరైన శక్తి లేకపోతే ఏ పని సరిగా చేయలేము. శక్తి హీనత కూడా ఒక జబ్బులాగే వేధిస్తుంది. ఏ పని చేయాలన్నా అడుగు ముందుకు సాగదు. ఇదంతా మనం సరైన పోషకాలు గల ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే గానీ అదేదో రుగ్మత అని కాదు. ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, బాగా నిసత్తువగా ఉన్నప్పుడు ఒక సపోటా పండు తిని చూడండి. కొద్ది నిముషాల్లోనే శక్తి పుంజుకుంటుంది. దీనిలో ప్రక్టోజ్, సుక్రోజ్, చక్కెర ఉండడమే అందుకు కారణం. ఈ సపోటాపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. సపోటా పండ్లును తరచూ తింటూ ఉంటే దృష్టిలోపాలు దూరమవుతాయి. అంతేకాకుండా రోగనిరోదక శక్తి పెరగడంతో పాటు ఊపిరితిత్తులకు ఎంతో మేలు జరుగుతుంది.
 
2. ఇవి మలబద్దక సమస్యను తగ్గిస్తాయి. ఈ పండులోని కొన్ని రసాయనాలు పేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర వ్యాధిగ్రస్తం కాకుండా కాపాడుతాయి. రక్తహీనత ఉన్నవారు, గర్భిణులు, వయోవృద్ధులు తరచూ సపోటా పండ్లను తింటే శరీరానికి అవసరమైన ఇనుము అంది రక్తహీనత నుండి బయటపడతారు. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి.
 
3. సపోటాలో రక్తవృద్ధి, ధాతుపుష్టిని కలిగించే అంశాలతో పాటు మరెన్నో ఔషధ గుణాలున్నాయి. సపోటాలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు లభిస్తాయి. ఇందులో కాల్షియం, పొటాషియం, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, సమృద్ధిగా ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరస్ గుణాలు కూడా ఇందులో ఎక్కువే. విటమిన్-ఏ, సీ విటమిన్లు కూడా ఇందులో ఉన్నాయి.