శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (12:32 IST)

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. టేక్‌వే మీల్‌లో 40 బొద్దింకలు

పెరుగుతున్న సాంకేతికత మన జీవన శైలిని మార్చేస్తోంది. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అడుగు ముందుకు వేయకుండానే అనుకున్న పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఫుడ్ యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండటంతో చాలా మంది బయటకు వెళ్లకుండానే ఇంటికి లేదా ఆఫీసుకే ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించుకుంటున్నారు. అయితే ఆర్డర్ ద్వారా డెలివరీ అయ్యే ఫుడ్ మంచిదా కాదా అని మనకు ఎలా తెలుస్తుంది. దీనిపై రోజురోజుకూ సందేహాలు పెరిగుపోతున్నాయి. 
 
ఇటీవల వచ్చిన వార్తల కారణంగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భయం వేస్తోంది. చైనా‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఒళ్లు జలదరిందే దృశ్యం ఎదురైంది. ఆకలేస్తోందని ఓ యాప్ ద్వారా డిష్‌ని ఆర్డర్ చేసింది. తిందామని కవర్ ఓపెన్ చేసి చూడగానే దానిలో బొద్దింక కనిపించింది. ఆహారాన్ని మొత్తం తీసిచూడగా చాలా బొద్దింకలు కనిపించాయి.

అవన్నీ తీసి లెక్కపెడితే 40 బొద్దింకలు వచ్చాయి. ఇంకెప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసినా నాకు బెద్దింకలే గుర్తుకు వస్తాయని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీని గురించి రెస్టారెంట్‌కు సమాచారం అందించింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.