నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!
ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి కోసం పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్ అయింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషికి ఈ నామినేషన్ లభించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి.
ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో దక్షిణాసియాలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు ఆయన 2019లోనూ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. ప్రతి యేటా నోబెల్ కమిటీ వందలాది నామినేషన్లు స్వీకరిస్తుంది. ఆ తర్వాత ఎనిమిది నెలల సుధీర్ఘ ప్రక్రియ ద్వారా విజేతలను ఎంపిక చేస్తుంది.
పాకిస్థాన్ ప్రధాన ప్రతిపక్షమైన పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ఆయనకు 14 యేళ్ల జైలుశిక్ష పడింది. కాగా, గత 2022లో అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు.