సిమ్ కావాలంటే ఆధార్ కార్డును సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని టెలికాం శాఖలకు ఆదేశాలు పంపించింది. గతంలో ఉన్నట్లే ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్ పోర్టు ఇలా వివిధ గుర్తింపు కార్డులకు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వినియోగదారుల నుంచి వస్తున్న వ్యతిరేకత, విమర్శలు, ఆధార్ డేటా లీకేజ్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కేంద్రం.. ఈ విధంగా...