శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 17 జనవరి 2021 (14:15 IST)

13 ఏళ్ల అమ్మాయిపై దారుణం.. తొమ్మిది మంది.. మూడేసి సార్లు.. ట్రక్కు మార్చి..?

13 ఏళ్ల అమ్మాయిపై దారుణం జరిగింది. తొమ్మిది మంది మృగాలు.. మూడేసి సార్లు ట్రక్కు మార్చి ట్రక్కులోకి ఎక్కించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. రోడ్డు మీద కనపడిన వాళ్లను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. 
 
సాయం చేసినట్టే చేసిన ఓ ట్రక్కు డ్రైవర్.. తానూ మృగాన్నేనని నిరూపించాడు. అతడూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను వదిలేసి పరారయ్యాడు. మొత్తంగా 9 మంది ఓ బాలిక జీవితంతో పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమేరియాలో ఈనెల 11-12 తేదీల మధ్య జరిగింది. ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల ప్రకారం.. ఉమేరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 11న షాపునకు వెళ్లింది. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఒంటరిగా వెళుతున్న బాలికను కిడ్నాప్ చేశారు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ట్రక్కులోనే బందీగా ఉంచి ఓ దాబాకు తీసుకెళ్లారు. 
 
అక్కడ మరో ఐదుగురు ఆ ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. దాబా యజమాని కూడా కనికరం చూపలేదు. తర్వాత ట్రక్కులోకి ఎక్కించి ఆ రోజు రాత్రంతా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు.