1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (15:57 IST)

కాంగ్రెస్‌కు పెద్దాపరేషన్ చేయకుంటే బతకడం కష్టం : దిగ్విజయ్ సింగ్

అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి పెద్దాపరేషన్ చేయకుంటే మనుగడ సాగించడం కష్టమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. 
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల అధికారాన్ని కోల్పోగా, పుదుచ్చేరిలో మాత్రం స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. తమిళనాడులో 43 సీట్లలో పోటీ చేసి కేవలం 8 సీట్లలో మాత్రమే గెలుపొందింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గత సీట్లకు అదనంగా మరో రెండు సీట్లు కైవసం చేసుకుని 44 సీట్లతో సరిపుచ్చుకుంది. 
 
ఈ ఫలితాలపై ఆయన స్పందిస్తూ... ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని, కానీ ఇవి ఊహించినవేనని అన్నారు. పార్టీకి పెద్ద శస్త్రచికిత్స అవసరమన్నారు. ఫలితాలపై పార్టీ ఆత్మశోధన చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఫలితాలపై ఆత్మశోధన చేసుకుంటామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.