Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?
ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఫిబ్రవరి 20వ తేదీన ఖరారయ్యే అవకాశం వుంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని ఇప్పటికే భారతదేశానికి తిరిగి వచ్చారు. అయినా బీజేపీ పార్టీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై ఇంకా క్లారిటీకి రాలేదు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి, ముఖ్యమంత్రి పదవి కోసం దాదాపు 5 మంది పేర్లు వినిపిస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బిజెపి గెలిచింది.
ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రధాని మోడీ నిర్ణయిస్తారు. ఇంతలో, ఢిల్లీలో చాలా సమీకరణాలు మారిపోయాయి. ముఖ్యమంత్రి కుర్చీకి అగ్ర ఎంపికగా పరిగణించబడిన పర్వేష్ వర్మ ఇకపై ఆ రేసులో లేరని చెబుతున్నారు. ఢిల్లీలోని బిజెపి వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, బిజెపి అగ్రనాయకత్వం మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆలోచిస్తోంది.
బిజెపి పాలిత ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీకి మహిళా ముఖ్యమంత్రి లేరనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో లాగా తొలిసారి మహిళను ముఖ్యమంత్రిని చేయాలని బిజెపి ఉన్నతాధికారులు ఆసక్తిగా ఉన్నారు. ఈ అంచనాల మధ్య, రేఖ గుప్తా పేరు ఒకటి తెరపైకి వచ్చింది.
ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి కావాలంటే, రేఖ గుప్తాను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రేఖ గుప్తా జాతీయ కార్యదర్శిగా, బిజెవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా, ఢిల్లీ బిజెపి మహిళా మోర్చా కార్యదర్శిగా, బిజెపి వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ నేపథ్యం ఆమెను ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక నడ్డాకు సన్నిహితుడైన ఆశిష్ సూద్, శిఖా రాయ్తో పాటు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రస్తుతానికి రేసులో ఉన్నారు.