పాకిస్థాన్కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) విషయంలో పాకిస్తాన్కు భారతదేశం బలమైన సందేశాన్నిచ్చింది. పాకిస్తాన్కు కాశ్మీర్తో ఉన్న ఏకైక సంబంధం అది చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాశ్మీర్ను పాకిస్తాన్ "జీవనాడి"గా అభివర్ణించిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత భారత ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దీనికి ప్రతిస్పందనగా, ఒక విదేశీ భూభాగాన్ని పాకిస్తాన్ జీవనాధారంగా ఎలా పరిగణించగలమని భారతదేశం ప్రశ్నించింది.
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన కార్యక్రమంలో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కాశ్మీర్పై పాకిస్తాన్ వైఖరి సరైనది కాదని, దేశం కాశ్మీర్ను ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై తన సార్వభౌమత్వాన్ని భారత్ తేల్చి చెప్పేసింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండా జమ్మూ కాశ్మీర్ అసంపూర్ణమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా భారతదేశం గుర్తుచేసుకుంది. పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కొనసాగిస్తోందని, పీఓకే పాకిస్తాన్కు విదేశీ భూభాగం కాబట్టి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకుంటుందని ఆయన ఆరోపించారు.