శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (12:45 IST)

రెస్ట్ రూమ్‌కు వెళుతూ కాలు తొక్కిన తల్లి.. కుకింగ్ ప్యాన్‌తో కొట్టిచంపిన కసాయి కొడుకు

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణ

వృద్ధ తల్లి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం రెస్ట్ రూమ్‌కు వెళుతూ పొరపాటున కాలు తొక్కింది. దీంతో ఆగ్రహించిన కొడుకు కసాయిగా మారిపోయాడు. పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో తల్లిని కొట్టి చంపేశాడు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మైసూరు కేఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో 85 యేళ్ళ గోవిందమ్మ తన కుమారుడు సుందరం (52)తో కలిసి నివశిస్తోంది. శుక్రవారం వేకువజామున 4 గంటలకు రెస్ట్‌రూమ్‌కు వెళ్తూ కుమారుడి కాలును తొక్కింది. 
 
దాంతో కోపం వచ్చి పక్కనే ఉన్న కుకింగ్ ప్యాన్‌తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. ఆ తర్వాత నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత నేరాన్ని అంగీకరించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. జైలుకు తరలించారు.