శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:12 IST)

పెంచిన కుమార్తె పెళ్లికి నిరాకరించిందని తల్లిదండ్రులు ఆత్మహత్య

పెంచిన కుమార్తె పెళ్లికి నిరాకరించిందని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హాసన్ జిల్లా ఆలూరుకు చెందిన పుట్టరాజు(58), అతని భార్య కాంతమ్మ(53)కు సంతానం లేకపోవడంతో బంధువుల పిల్లల్లో ఒక బాలికను, బాబును తెచ్చుకుని పెంచుకున్నారు. 
 
ఇటీవలే కుమారుడికి పెళ్లి చేశారు. ప్రాణంగా పెంచుకున్న కుమార్తెకు కూడా వివాహం చేయాలని నిర్ణయించారు. పెళ్లి కుదిర్చి నిశ్చితార్థం విషయాన్ని కుమార్తెకు తెలిపారు.
 
అయితే.. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అక్కడాఇక్కడా వెతికి ఆమెకు నచ్చజెప్పి ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి ఇంటికి తీసుకొచ్చాక ఈ పెళ్లి చేసుకోమని కుమార్తెను కోరారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడితే ఆత్మహత్య చేసుకుంటానని కుమార్తె బెదిరించింది. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన పుట్టరాజు, కాంతమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
రాత్రి కుమార్తె నిద్రపోయిన తర్వాత పశువుల కొట్టంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెల్లారాక గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.