1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Viral Video Shows Train Halted For Samosas? Railways Orders Probe

సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)

loco pilot - samosa
సమోసాల కోసం లోకో పైలెట్ ఒకరు రైలు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇండోర్ - మౌ మధ్య డెమో రైలు నడుస్తుంది. ఈ రైలుకు ఇంజనీరింగ్ పనులు కారణంగా సిగ్నల్ ఇవ్వలేదు. 
 
ఆ సమయంలో పక్కనే ఉన్న దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసేందుకు లోకో పైలెట్ రైలు దిగి, నేరుగా దుకాణంలోకి వచ్చి సమోసాలు కొనుక్కుని తిరిగి రైలు ఎక్కారు. దీన్ని కొందరు యువకులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే, కొందరు స్థానికులు మాత్రం లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలును ఆపాడంటూ చేసిన కామెంట్స్‌ను రైలు అధికారులు కొట్టిపారేశారు. అదేసమయంలో ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మెరుగైన చికిత్స చేయిస్తానని చెప్పి కదిరి ఆస్పత్రిలో భార్యను హత్య చేసిన భర్త