సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)
సమోసాల కోసం లోకో పైలెట్ ఒకరు రైలు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ముఖ్య నగరాల్లో ఒకటైన ఇండోర్ - మౌ మధ్య డెమో రైలు నడుస్తుంది. ఈ రైలుకు ఇంజనీరింగ్ పనులు కారణంగా సిగ్నల్ ఇవ్వలేదు.
ఆ సమయంలో పక్కనే ఉన్న దుకాణంలో సమోసాలు కొనుగోలు చేసేందుకు లోకో పైలెట్ రైలు దిగి, నేరుగా దుకాణంలోకి వచ్చి సమోసాలు కొనుక్కుని తిరిగి రైలు ఎక్కారు. దీన్ని కొందరు యువకులు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. అయితే, కొందరు స్థానికులు మాత్రం లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలును ఆపాడంటూ చేసిన కామెంట్స్ను రైలు అధికారులు కొట్టిపారేశారు. అదేసమయంలో ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
సమోసాల కోసం దిగిన లోకో పైలట్.. నిజం ఇదే!
— ChotaNews App (@ChotaNewsApp) July 8, 2026
మధ్యప్రదేశ్లో సమోసాల కోసం ఒక లోకో పైలట్ రైలు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇండోర్-Mhow మధ్య నడిచే డెమూ రైలు, ఇంజినీరింగ్ పనుల కారణంగా సిగ్నల్ పడటంతో ఒకచోట ఆగింది. ఆ సమయంలో లోకో పైలట్ ట్రాక్ పక్కనే ఉన్న హోటల్లో సమోసాలు… pic.twitter.com/4mDqcQvsWw
