1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Mahakumbh 2025: Important Things To Keep In Mind While Visiting Kumbh Mela

Mahakumbh 2025: కుంభమేళా పండుగకు వెళ్తున్నారా? ఐతే ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి.. (video)

Maha Kumbh mela 2025
Maha Kumbh mela 2025
భారతీయ సంప్రదాయంలో అంతర్భాగమైన కుంభమేళా పండుగ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని నాలుగు వేర్వేరు ప్రదేశాలలో జరుగుతుంది. హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, నాసిక్, ఉజ్జయినిలలో ఇది జరుగుతుంది. ఇది ప్రాచీన హిందూ సంప్రదాయాలలో పాతుకుపోయింది. ఇది ఆధ్యాత్మికత, భక్తి, సాంస్కృతిక వారసత్వంకు ప్రతీక. 
 
మహాకుంభ్ జనవరి 13న పవిత్రమైన లోహ్రీ సందర్భంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు 'జీవితంలో ఒకసారి మాత్రమే' లభించే ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. 
 
మీరు కూడా కుంభమేళాను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ఏవైనా ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ఆనందదాయకంగా మార్చడానికి మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
 
షాహి స్నానాలు అని పిలువబడే ప్రధాన స్నాన తేదీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం తప్పదు. ఇంకా స్నానం చేసే నదీ ప్రాంతాల్లో నెమ్మదిగానే కదలాల్సిన పరిస్థితి వుంటుంది. కాబట్టి ఓర్పు, ప్రశాంతత అవసరం. 
 
మీ వస్తువులను రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీతో వచ్చిన వారికి విడిపోయినట్లయితే మీ గుంపుతో సమావేశ స్థలాన్ని ఏర్పాటు చేసుకోండి. సన్నిహితంగా ఉండటానికి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించండి.
 
 ముఖ్యంగా ఆచారాలలో పాల్గొనేటప్పుడు లేదా పవిత్ర స్థలాలను సందర్శించేటప్పుడు గౌరవంగా దుస్తులు ధరించడం ముఖ్యం. ఎక్కువ దూరం నడవవలసి రావచ్చు. కాబట్టి కదలికను సులభతరం చేయడానికి వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులను ఎంచుకోండి.
 
మేళా మైదానంలో నడిచేందుకు పాదరక్షలు చాలా అవసరం. పవిత్ర స్నానంలో పాల్గొనాలని ప్లాన్ చేస్తే, ఆ సందర్భానికి తగిన ఈత దుస్తులు లేదా సాంప్రదాయ దుస్తులను తీసుకురావాలి. ఎల్లప్పుడూ మీతో నీరు, స్నాక్స్ తీసుకెళ్లండి. రోజంతా శక్తిని నిలబెట్టుకోవడానికి నీటి సీసాలు, ఎనర్జీ బార్‌లు, డ్రై ఫ్రూట్స్ అనుకూలమైన ఎంపికలు.
 
పవిత్ర నదులలో పవిత్ర స్నానం చేయడం వంటి ఆచారాల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి సమయం కేటాయించండి. ఇది పాపాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. కుంభమేళా భక్తికి నిలయం, కాబట్టి దురుసుగా వ్యహరించకండి. హుందాగా ప్రవర్తించండి. 
 
ముఖ్యంగా స్నానాలు ఎక్కువగా జరిగే సమయాల్లో మీ బసను ముందుగానే బుక్ చేసుకోవడం ప్రయోజనకరం. ప్రయాగ్‌రాజ్ లేదా చుట్టుపక్కల పట్టణాలు వంటి సమీప ప్రాంతాలలో హోటల్ బుక్ చేసుకోవడాన్ని మరిచిపోవద్దు. ఇంకా జలుబు, జ్వరం మందులు బ్యాగులో పెట్టుకోవాలి.

గంగానది స్నానం అనంతరం హోటల్ గదికి వచ్చాక గంట తర్వాత స్నానం చేసేయడం మంచిది. ఇలా చేస్తే భారీ రద్దీ కారణంగా ఏర్పడే అనారోగ్య రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. పవిత్ర స్నానం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణం చేపట్టడం మంచిది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తిరుమల అద్భుతాలు.. కలియుగాంతంలో వెంకన్న అప్పు తీరుతుందట! నిజమేనా?