సంబంధిత వార్తలు
- నటుడు దిలీప్కు వీఐపీ దర్శనమా? తప్పుబట్టిన కేరళ హైకోర్టు
- ముక్కోటి ఏకాదశి : ఏకాదశి వ్రతంతో పుణ్యఫలం.. విష్ణు సహస్రనామాన్ని చదివినా.. విన్నా...?
- Guru Gobind Singh Jayanti 2025: గురు గోవింద్ సింగ్ జయంతి.. కోట్స్ ఇవే
- Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!
- Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)
తిరుమలలో టిక్కెట్ల స్కామ్.. ఏం దోచుకుంటున్నారో తెలుసా? ప్రోటోకాల్ దర్శనం.. రూ.50వేలు! (video)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించిన లడ్డూ వివాదం సంచలనం సృష్టించింది. భారీ సంపన్న ఆలయంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రతిరోజూ లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. ఆయనకు భారీగా కానుకలు ఇస్తుంటారు. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆభరణాలను తితిదే బోర్డులో పనిచేసే ఓ అధికారి ఇటీవల దొంగలించినట్లు వార్తలొచ్చాయి.
తాజాగా తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల మోసం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు నకిలీ టికెట్ల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో అడుగడుగునా అవినీతి తాండవం చేస్తోంది. అనుమానం వచ్చిన తితిదే విజిలెన్స్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కొందరు భక్తులను నిలిపి విచారణ చేపట్టారు. విచారణలో ఈ మోసానికి సంబంధించి ఐదుగురు నిందితులు బయటపడ్డారు.
వీరిలో లక్ష్మీపతి (రూ.300 టికెట్ల కౌంటర్ ఉద్యోగి), మణికంఠ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), భానుప్రకాశ్ (అగ్నిమాపక శాఖ సిబ్బంది), టాక్సీ డ్రైవర్లు శశి (తిరుపతి), జగదీశ్ (చెన్నై) ఉన్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, టాక్సీ డ్రైవర్లు భక్తులను సేకరించి, నకిలీ టికెట్ల ద్వారా దర్శనం చేయించేవారు.
ఈ క్రమంలో వీఐపీ బ్రేక్ దర్శనం: రూ.25,000
ప్రోటోకాల్ దర్శనం: రూ.50,000
ఉద్యోగుల దర్శనం: రూ.10,000 - రూ.15,000లు దోచుకుంటున్నారు.
ఈ స్కామ్ వివరాలు వెలుగులోకి రావడంతో దయచేసి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుని తిరుమల పవిత్రతను కాపాడాలని.. విశ్వాసాన్ని నిలబెట్టాలని భక్తులు కోరుతున్నారు.
ఓం నమో వెంకటేశాయ..????????
— Venugopalreddy Chenchu (TDP Official Spokesperson) (@venuchenchu) January 16, 2025
కల్మషం ఐపోయిన కలియుగ పుణ్యక్చేత్రం, అడుగడుగునా అవినీతి మయం..
VIP బ్రేక్ దర్శనం: ₹25,000
ప్రోటోకాల్ దర్శనం: ₹50,000
ఉద్యోగుల దర్శనం: ₹10,000 - ₹15,000
ఇలా దళారుల అడ్డాగా మారిపోయిన తిరుమల, లాభాల కేంద్రంగా భక్తి కేంద్రం..????????
గత ప్రభుత్వంలో పెంచి… pic.twitter.com/bGWawsymyF
