Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!
Tirumala
క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధంలో లభ్యమయ్యే తమిళ సాహిత్యంలో 'తిరువేంగడం' అనే పేరుతో ఈ ఆలయం గురించి వర్ణించారు కవులు. అందులో సూర్య చంద్రులు ఆరాధిస్తుండగా ఒక పద్మ పీఠంపై స్వామి నిలబడి ఉన్నారు అని వర్ణించబడి ఉంది. అంటే 3వ శతాబ్ధానికి పెద్దగా గుడి ఏమీ లేక, ఆరుబయటే గుడి ఉంది అని చరిత్రకారులు తీర్మానించారు. తరువాత ఇప్పుడు మనం చూస్తున్న గర్భాలయం క్రీస్తు శక్తం 900 సంవత్సరానికి ముందు కాలానికి చెందినదని తెలుస్తోంది.
లోపల గర్భ గృహంలో ఉన్న వేంకటేశ్వరస్వామి విగ్రహానికి అచ్చమైన నకలులాంటి ఒక చిన్ని విగ్రహాన్ని ఈ గోపురంపైన చెక్కించారు. గర్భాలయానికి ప్రదక్షిణగా వెళ్ళినప్పుడు వాయువ్యమూలన, ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ స్వామివారు. ప్రస్తుతం విమాన స్వామికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మనం చూడని చూడలేని , తిరుమల లోని ఏడుకొండల వేంకటేశ్వర స్వామి... బంగారు గోపురం పైభాగం. pic.twitter.com/ljZfl58FFH
— Swathi Reddy (@Swathireddytdp) December 28, 2024
