సంబంధిత వార్తలు
- Christmas : చంద్రబాబు, పవన్, జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు
- Christmas: పౌరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
- నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన.. 25న క్రిస్మస్ వేడుకలు
- పండుగ వినోదాలతో క్రిస్మస్ అద్భుతాన్ని ఆవిష్కరించిన ఇనార్బిట్ మాల్ సైబరాబాద్
- Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?
Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)
Tirumala
శ్రీవారి ఏడు కొండలు పొగమంచుతో చుట్టుముట్టాయి. తిరుమల సప్త గిరులు హిమ గిరులను తలపిస్తున్నాయి. వెంకన్న ఏడు కొండలు మంచు కొండల్లా మారాయి. శ్రీవారి కొండలను మంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా తిరుమల రెడో ఘాట్ రోడ్డు వద్ద ఆనుకుని వున్న కొండ లోయలలో తెరలు తెరలుగా మంచు తివాచీలు పంచుకున్నాయి. ఈ దృశ్యాలు భక్తులను ఆశ్చర్య పరుస్తున్నాయి. దివి నుంచి భువికి వెండి మబ్బులు దిగివచ్చినట్లు ఆ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ దృశ్యాలను భక్తులు సెల్ ఫోన్లలో బంధించి ఎంజాయ్ చేస్తున్నారు.
ఇకపోతే... తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అన్ని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయి.
ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల రద్దీగా మారిపోయింది. మాడవీధులు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు ఎక్కువగా ఉండటంతో అక్కడ తగిన ఏర్పాట్లు చేశారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.
తిరుమల లో అద్బుత దృశ్యం
— Nani (@SriTDP999) December 26, 2024
వేంకటేశ్వర స్వామి మహిమ ????❤ pic.twitter.com/9aKaqD0SOn
