తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా భక్తుల రద్దీ మాత్రం తిరుమలలో అంతంతమాత్రంగా ఉంది. ఆదివారం కనిపించిన భక్తుల రద్దీ సోమవారానికి తగ్గింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలు పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి మూడు గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 79,424 మంది భక్తులు దర్శిచుకోగా హుండీ ఆదాయం రూ.2.47 కోట్లు వసూలైంది.
