1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Is an Aadhaar card compulsory for TTD Darshan?

శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరి..

శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా ఇకపై

Aadhaar card
శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఇకపై ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకు ఖాతాలకు, పాన్ కార్డులకు ఆధార్ అనుసంధానాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించిన నేపథ్యంలో స్వామివారి దర్శనానికి కూడా ఇకపై ఆధార్‌ను తప్పనిసరి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.

తిరుమలకు వచ్చే భక్తుల్లో 94శాతం మంది ఆధార్ కార్డులను కలిగివున్నారని.. ఆధార్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అక్రమాలను సులభంగా అరికట్టవచ్చునని భావిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా తొలి దశలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్‌ తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఉండేవారికి మాత్రం పాస్ పోర్ట్ నెంబరును ఆప్షన్‌గా ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ ఆధార్‌ తప్పనిసరిపై ఇప్పటికిప్పుడు భక్తులపై ఒత్తిడి చేయబోమని అధికారులు చెప్తున్నారు.
About Writer
Selvi
తర్వాతి కథనం
అమ్మవారిని గరికతో, మహాలక్ష్మిని ఉమ్మెత్త పువ్వులతో పూజించకూడదట