1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Nagarjuna School Principal Murder.. Shocking Twist

నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ హత్య.. విద్యార్థులే హంతకులు.. రూ.4లక్షల కోసమే చంపేశారా?

Rupa Reddy
Rupa Reddy
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొండమల్లెపల్లిలో ప్రిన్సిపాల్ దారుణ హత్యకు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో ఒకరు అదే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థి అని, మిగిలిన ఇద్దరూ అదే పాఠశాలకు చెందిన మాజీ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. 
 
వీరు ముగ్గురు ప్రిన్సిపాల్ ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడిచి ప్రిన్సిపాల్‌ను హత్య చేశారు. వేలిముద్రలు పడకుండా ఉండేందుకు నిందితులు గ్లౌజులు ధరించారుని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సుమారు 80 మందిని పోలీసులు విచారించారు.

రూ.4 లక్షల నగదు కోసమే ఈ హత్య జరిగిందా? లేకుంటే ఈ హత్యకు వేరైదైనా కారణం వుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇబ్రహీంపట్నం సమీపంలో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
దుండిగల్ గ్రామంలో బయల్పడిన తెలుగు-కన్నడ లిపితో కూడిన శాసనం