1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 27 జనవరి 2021 (18:12 IST)

`మ‌నం`కు సీక్వెల్ దిశ‌గా ద‌ర్శ‌కుడు విక్ర‌మ్‌కుమార్‌

Akkineni Nagarjuna,manam
అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారు బ‌తికుండ‌గానే `మ‌నం` క‌థ‌తో గిఫ్ట్‌గా ఇచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. దానితో అక్కినేని కుటుంబంతో ఆయ‌న‌కు ఎన‌లేని అనుబంధం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్ద లాభించ‌లేదు. `మ‌నం`లో అక్కినేని కుటుంబం మూడు తరాల హీరోలను కలిపి ఈ సినిమాలో చూపించారు.

పూర్వజన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి చివరి చిత్రం ఇదే అయ్యింది. ఈ సినిమా తర్వాత అక్కినేని  అఖిల్తో ‘హలో’ అనే సినిమా చేశారు విక్రమ్. అది పాత‌క‌థే అవ‌డంతో పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.  నాని హీరోగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ ఆ సినిమాతోను ఆకట్టుకోలేకపోయారు. దాంతో మ‌ర‌లా పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్‌పై మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
 
మ‌నం చేశాక‌, రామానాయుడు కుటుంబం క‌లిసేలా ఓ చిత్రాన్ని నిర్మించ‌మ‌ని ఆఫ‌ర్ వ‌చ్చినా అందుకు ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో చేయ‌లేక‌పోయిన‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. క‌నుక మరోసారి భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారట విక్రమ్. ఈసారికూడా అక్కినేని కుటుంబంతోనే వుండ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

ముఖ్యంగా నాగార్జున , నాగ చైతన్య,  అఖిల్, స‌మంత‌, అమల, సుమంత్, సుశాంత్ ఇలా అక్కినేని ఫ్యామిలీ నటీనటులందరితో ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించే ఆలోచనలో ద‌ర్శ‌కుడు వున్న‌ట్లు తెలుస్తోంది. ఆమ‌ధ్య స‌మంత న‌టించిన `ఓబేబీ`ని కూడా రిఫ‌ర్ చేస్తూ ఈ త‌ర‌హా కాన్సెప్ట్‌తో స‌రికొత్త‌గా వుండేలా ప్లాన్ చేయాల‌ని నాగార్జున సూచించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. కాబ‌ట్టి అందుకు తగ్గ కథను దర్శకుడు సిద్ధం చేస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లో మ‌రిని వివ‌రాలు తెలియ‌నున్నాయి.