శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (19:47 IST)

లాయర్‌కు రోజుకు రూ.10 లక్షల ఫీజు చెల్లిస్తున్న సుశాంత్ ప్రియురాలు

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, ఈ కుర్ర హీరోకు బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పాటు.. అంకిత అనే ప్రేయసిలు ఉన్నారు. వీరిలో రియా చక్రవర్తి చేసిన మోసం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెతోపాటు.. మరో నలుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో రియా చక్రవర్తి వద్ద వివరాలు సేకరించేందుకు ముంబైకు చేరుకున్న పోలీసులకు... రియా కనిపించకుండా పోయింది. 
 
ఇదిలావుంటే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా బీహార్ పోలీసులు బాంద్రాలోని కోట‌క్ మ‌హీంద్ర బ్యాంక్‌కు వెళ్లి.. సుశాంత్ బ్యాంకు ఖాతా వివ‌రాలు సేకరించారు. ఇందులో సుశాంత్ చ‌నిపోయేకంటే ముందు అత‌ని అకౌంట్ నుంచి రూ.15 కోట్లు వివిధ ఖాతాల‌కు బ‌దిలీ అయిన‌ట్టు పోలీసులు గుర్తించారు.
 
మ‌రోవైపు రియా వ్య‌క్తిగ‌త బ్యాంకు లావాదేవీల‌పై కూడా ఆరా తీశారు. ఇదిలావుంటే రియా చ‌క్ర‌వ‌ర్తి త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సుశాంత్ ను దోపిడీ చేసి ప్రాణాలు పోయేలా చేశార‌ని.. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఇక్కడ మ‌రో ఆస‌క్తికర విష‌య‌మేంటంటే.. రియా ముంబైలో పేరు మోసిన లాయ‌ర్ స‌తీశ్ మాన్‌షిండే‌కు త‌న కేసు అప్ప‌గించింద‌ట‌. అంతేకాదు రియా ఆమె లాయ‌ర్ స‌తీశ్‌కు రోజుకు రూ.10 ల‌క్ష‌లు ఫీజు ఇస్తున్న‌ట్టు వార్త ఇపుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
 
అంతంత మాత్ర‌మే సినిమా అవ‌కాశాలున్న రియా చ‌క్ర‌వ‌ర్తి మ‌రి ఇంత పెద్ద మొత్తంలో లాయ‌ర్‌కు ఫీజు ఇస్తుందన‌డం.. పలు అనుమానాల‌కు తావిస్తోంది. రియా చ‌క్ర‌వ‌ర్తి గ‌త కొన్ని రోజులుగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జ‌రిపింది. 
 
రియా వెనుక అస‌లు ఎవ‌రెవ‌రున్నారు.. రియా ఒక్క‌రే ఇంత పెద్ద మొత్తంలో న‌గ‌దును వినియోగించిందా..? ఇలా ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి కేసు విచార‌ణ పూర్త‌యితే మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.