శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 19 మే 2020 (11:02 IST)

ఛార్మీ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?

ఛార్మింగ్ గాళ్ ఛార్మీ కౌర్. అగ్రహీరోల సరసన నటించి.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సక్సస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో నటనకు దూరమైంది. 
 
పూరి దర్శకత్వంలో రూపొందిన "జ్యోతిలక్ష్మి" సినిమాలో నటించిన ఛార్మి... ఆ తర్వాత మళ్లీ తెర పై కనపడలేదు. ఓ మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనుకుంటే... ఇప్పటివరకు మరో సినిమాలో నటించలేదు. అయితే.. ఇటీవల సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 
 
ఇంతకీ ఆ ప్రకటన ఏంటంటే... ఇక తను సినిమాల్లో నటించను అని ప్రకటించింది. ఇంత సడన్ గా ఏంటి..? ఈ ప్రకటన అంటే... ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. 'జ్యోతిలక్ష్మి' సినిమా సమయంలో తీసుకున్న నిర్ణయమని.. అప్పుడే ఎనౌన్స్ చేస్తానంటే... డైరెక్టర్ పూరి, నిర్మాత సి.కళ్యాణ్ వద్దని చెప్పడంతో ఆగిపోయానని అన్నారు. 
 
నిర్మాతగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. యాక్టింగ్ కంటే.. ప్రొడక్షనే తను కిక్ ఇస్తుందని చెప్పారు ఛార్మి. ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి డైరెక్షన్‌లో చేస్తున్న మూవీ కరోనా కారణంగా ఆగింది. లేదంటే... ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉండేదాన్ని అని చెప్పారు. 
 
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హడావిడిగా షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకోవడం లేదు. కొంత టైమ్ తీసుకుని అంతా సెట్ అయిన తర్వాతే షూటింగ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నట్టు తెలియచేసారు ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ ఛార్మింగ్ గాళ్ విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.