1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. After 33 Years, Ramayan has set a world record by becoming the highest viewed entertainment program

ప్రపంచ రికార్డు సృష్టించిన రామానంద సాగర్ 'రామాయణం'

After 33 Years
33 సంవత్సరాల తరువాత మళ్లీ ప్రసారం అయిన "రామాయణం" ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన వినోద కార్యక్రమంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. కరోనా వైరస్ విజృంభణ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వెంటనే మార్చిలో దూరదర్శన్ నేషనల్లో రామాయణం ప్రసారం ప్రారంభమైంది. ఏప్రిల్ 16 న ప్రపంచవ్యాప్తంగా 77 మిలియన్ల (7.7 కోట్లు) ప్రజలు ఈ ప్రదర్శనను చూశారని డిడి నేషనల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
 
"దూరదర్శన్‌లో రామాయణం యొక్క పునఃప్రసారం ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల రికార్డులను బద్దలు కొట్టింది, ఈ ప్రదర్శన ఏప్రిల్ 16న 7.7 కోట్ల మంది ప్రేక్షకులతో ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచింది" అని డిడి నేషనల్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
 
రామనంద్ సాగర్ రాసిన, నిర్మించిన మరియు దర్శకత్వం వహించిన "రామాయణం", 1987లో దూరదర్శన్‌లో మొదటిసారి ప్రసారం చేయబడింది. ఈ సీరియల్లో రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపిక చిఖ్లియా తోపివాలా, లక్ష్మణ్ పాత్రలో సునీల్ లాహ్రీ నటించారు. ఇందులో ప్రముఖ నటులు లలితా పవార్ మంతారా, అరవింద్ త్రివేది రావణ, దారా సింగ్ హనుమంతుడిగా నటించారు.
 
కాగా "ఉత్తర రామాయణం" చివరి ఎపిసోడ్ శనివారం ప్రసారం కానుంది. ఈ షో స్థానంలో సాగర్ యొక్క మరో ప్రసిద్ధ సిరీస్ "శ్రీ కృష్ణ" ఉంటుంది, ఇది ఆదివారం నుండి ప్రసారం కానుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఆ నరకాన్ని నాకు చూపించారు, జబర్దస్త్ ఫేమ్ సాయితేజ