అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు!?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతికి.. మహేష్ ముద్ర వుండేలా పలువురు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే బుర్రిపాలెం తన తండ్రి ఊరిని దత్తత తీసుకుని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది.
రామకృష్ణ వెంచర్ అనే సంస్థ మహేష్తో పబ్లిసిటీ చేసుకుని మహేష్ను అంబాసిడర్గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన యాడ్ షూట్ను కూడా చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ను ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. ఆ తర్వాత పనామా పేపర్ల నేపథ్యంలో పునరాలోచనలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించిన సందర్భంగా రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రాండ్ అంబాసిడర్గా కనిపించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. దీంతో ఏపీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే ఛాన్సుందని తెలుస్తోంది.