1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (15:38 IST)

టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి?

టాలీవుడ్‌కు గుడ్‌ న్యూస్‌ వచ్చేస్తోంది. సినిమాల థియేటర్లలో టిక్కెట్ల రేట్లు పెంచితేనే బెటర్ అనేది ఏపీ సర్కారు కమిటీ వేసిన ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ ప్రకారమే త్వరలో థియేటర్లలో రేట్ల పెంపు ఉండబోతోంది. ఇంతకీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్  ఏం చెప్తుందంటే.. మల్టీప్లెక్స్‌ టికెట్ల రేట్లలో పెద్దగా తేడాలుంవు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు మాత్రం పెరగాలన్నదే సారాంశం. 
 
ఆ రిపోర్ట్ ప్రకారం.. ప్రాంతం ఏదైనా సరే, నాన్‌ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర: 30 రూపాయలు ఉండాలి. జీవో నెంబర్ 35 ప్రకారం అది కేవలం 5 రూపాయలే. అంటే ఇప్పుడు కమిటీ రిపోర్ట్ ప్రకారం రూ.25 అదనం అవ్వబోతోంది. అలాగే నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను.. 70 రూపాయలకు పెంచాలని రిపోర్ట్ ఇచ్చింది.
 
ఇక కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌లో రెండు కీలక అంశాలున్నాయి. జీవో నెంబర్ నెంబర్ 35 ప్రకారం సినిమా హాల్‌ ఉండే ప్రాంతాన్ని బట్టి ప్రాపర్టీ ట్యాక్స్‌లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు గానీ.. టికెట్ రేట్లు మాత్రం ఏసీనా, నాన్ఏసీనా, మల్టిప్లెక్సా అన్న దానితోనే ముడిపడి ఉంటుందన్నమాట.